Thu Jan 29 2026 04:41:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నాళ్లిలా…? అంతమే లేదా?
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 77వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగతున్నాయి. రెండున్నర నెలలుగా తాము ఆందోళనలు [more]
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 77వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగతున్నాయి. రెండున్నర నెలలుగా తాము ఆందోళనలు [more]

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 77వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగతున్నాయి. రెండున్నర నెలలుగా తాము ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తుళ్లూరు, మందడం, పెనుమాక, ఎర్రబాలెం ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. వివిధ పార్టీల నుంచి మద్దతు లభిస్తున్నా రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు జరగకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
Next Story

