Thu May 02 2024 16:50:05 GMT+0000 (Coordinated Universal Time)
బుగ్గన బరిలోకి దిగారు....!
పీఏసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. తాను బీజేపీ జాతీయ స్థాయి నేతలకు ప్రభుత్వ రహస్య పత్రాలను అందించానని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజానామా చేస్తానాని, లేకుంటే మీరు రాజీనామాచేస్తారా? అని ప్రశ్నించారు. తనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న బురద జల్లే కార్యక్రమానికి బుగ్గన ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన టీడీపీ నేతలపై ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తనపై అనవసర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ లపై బుగ్గన ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఏపీ భవన్ లోని లాగ్ బుక్ ను టీడీపీ నేతలు ట్యాంపరింగ్ చేశారన్నారు. బీజేపీ, టీడీపీ బంధమేంటో అందరికీ తెలుసునన్నారు.
- Tags
- andhra pradesh
- ap politics
- buggana rajendranadh reddy
- janasena party
- kankamedal ravindra kumar
- nara chandrababu naidu
- pavan kalyan
- privilage committee
- telugudesam party
- y.s. jaganmohan reddy
- yarapathineni srinivasa rao
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కనకమేడల రవీంద్ర కుమార్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రివిలైజ్ కమిటీ
- బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
- యరపతనేని శ్రీనివాసరావు
- వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story