Sun Feb 01 2026 07:21:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏ క్షణమైనా రాజధానిని తరలిస్తాం
ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ న్యాయస్థానం ద్వారా అడ్డుకోకుంటే ఎప్పుడో తరలించేవారమని చెప్పారు. న్యాయస్థానంలో [more]
ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ న్యాయస్థానం ద్వారా అడ్డుకోకుంటే ఎప్పుడో తరలించేవారమని చెప్పారు. న్యాయస్థానంలో [more]

ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ న్యాయస్థానం ద్వారా అడ్డుకోకుంటే ఎప్పుడో తరలించేవారమని చెప్పారు. న్యాయస్థానంలో వాస్తవాలు వివరించి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారాన్ని దుర్వినియోగం చేశారని బొత్స విమర్శించారు. త్వరలోనే 32 మున్సిపాలిటీలకు, మూడు కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. విలీన గ్రామాలతోనే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Next Story

