Fri May 03 2024 18:41:28 GMT+0000 (Coordinated Universal Time)
పర్యటనలు మీవి... భారం ప్రజలకా..?
తాడేపల్లిగూడెంలో టీడీపీ నేతలు చర్చకు పిలిచి పారిపోయారని, చర్చకు వచ్చే సత్తా టీడీపీకి లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ, బెంగళూరు, చెన్నైకి రాజకీయ పర్యటనల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, వాహనాలను, హెలీకాఫ్టర్లను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ పర్యటనల ఖర్చును ప్రజలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు.
Next Story