Sat Dec 06 2025 10:37:05 GMT+0000 (Coordinated Universal Time)
రెండు రాష్ట్రాల్లో భారత్ బంద్
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ శాంతియుతంగా కొనసాగుతుంది. రైతు సంఘాలతో పాటువామపక్ష పార్టీలు కలసి ఈ బంద్ ను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ శాంతియుతంగా కొనసాగుతుంది. రైతు సంఘాలతో పాటువామపక్ష పార్టీలు కలసి ఈ బంద్ ను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన [more]

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ శాంతియుతంగా కొనసాగుతుంది. రైతు సంఘాలతో పాటువామపక్ష పార్టీలు కలసి ఈ బంద్ ను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన రైతు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నేడు దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏపీలో వైసీపీ ప్రభుత్వం బంద్ కు మద్దతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపారసంస్థలు మూతపడ్డాయి.
Next Story

