Tue Mar 24 2026 22:43:59 GMT+0530 (India Standard Time)
ఏపీలో పొత్తు ఇప్పుడే కాదు...!!

చంద్రబాబు, రాహుల్ గాంధీ భేటీతో మహాకూటమికి తొలి అడుగు పడిందని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకుని ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ చంద్రబాబు, రాహుల్ తదుపరి భేటీ గురించే మాట్లాడేందుకు తాను ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. రాహుల్ దూతగానే తాను వచ్చానన్నారు.
సభలు, ర్యాలీలపై.....
తెలంగాణలో రాహుల్ గాంధీ, చంద్రబాబు కలసి సభలో పాల్గొనే విషయం పై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై మాత్రం ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. మరికాసేపట్లో గెహ్లాట్ చంద్రబాబుతో భేటీ కానున్నారు. మహాకూటమి తరుపున జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ ర్యాలీలు, సభలు నిర్వహించాల్సిన విషయం కూడా ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశముంది.
Next Story

