Thu Dec 18 2025 13:34:52 GMT+0000 (Coordinated Universal Time)
సర్జికల్ స్ట్రైక్స్ పై అసదుద్దిన్ ఏమన్నారంటే…?
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేయడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. భారత [more]
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేయడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. భారత [more]

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేయడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. భారత వాయు సేనకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పుల్వామా ఘటన జరిగాక రెండుమూడు రోజులకే ఇటువంటి దాడులు జరగాలని తాను అనుకున్నానని… ఇప్పటికైనా ఈ దాడులు జరగడం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం చేసిన ఈ పని అభినందనించదగ్గదని, కేంద్ర ప్రభుత్వం వెనుక తాముంటామన్నారు.
Next Story
