Tue Jan 20 2026 22:15:11 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మంత్రి పేర్నినాని ధ్వజం
పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఎంత చెబితే అంత. చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం పవన్ కల్యాణ్..

తాడేపల్లి : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై ఏపీ మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. సోమవారం ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కొత్తజిల్లాల నవీకరణపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఎక్కడైనా మంచి జరుగుతుంటే దాని గురించి మాట్లాడలేనివాళ్లు నోటికి తాళం వేసుకోవడం మంచిదన్నారు.
పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఎంత చెబితే అంత. చంద్రబాబు దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం పవన్ కల్యాణ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ ఇచ్చినపుడు పవన్ ఎక్కడున్నాడు? ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా అభిప్రాయాలను పంచుకున్నాడా? చంద్రబాబు ఆఫీసు నుంచి వచ్చిన దానిపై సంతకం చేయడం తప్ప ఏంచేశాడు? అంటూ పేర్ని నాని మీడియా ముఖంగా నిప్పులు చెరిగారు.
Next Story

