Sun Mar 15 2026 07:15:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బెజవాడలో హై అలెర్ట్
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. విజయవాడ పట్టణంలోనే 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారు. మిగిలిన [more]
విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. విజయవాడ పట్టణంలోనే 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారు. మిగిలిన [more]

విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. విజయవాడ పట్టణంలోనే 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో నలుగురు విదేశాల నుంచి వచ్చిన వారు. మిగిలిన 14 కేసులు మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. దీంతో విజయవాడలోని మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. రాజరాజేవ్వరి పేట, భవానీపురం, ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ విధించారు. ఇక్కడ ఇళ్ల నుంచి ఎవరిని బయటకు రానివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఏపీలో ఇప్పటికి మొత్తం 149 కి చేరాయి. నిన్న ఒక్కరోజే 38 కేసులు నమోదయ్యాయి.
Next Story

