విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ ఏర్పాటు
విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలో ఏపీ ప్రభుత్వం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో హై పవర్ కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న [more]
విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలో ఏపీ ప్రభుత్వం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో హై పవర్ కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న [more]
విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలో ఏపీ ప్రభుత్వం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో హై పవర్ కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో కమిటీని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరితో పాటు కమిటీలో పరిశ్రమల శాఖ సెక్రటరీ కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ ఎస్పీ ఆర్కే మీనా, పీసీబీ మెంబరు వివేక్ లను సభ్యులుగా నియమించారు. నెలరోజుల్లో ఈ కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. విశాఖ ప్రమాద ఘటనలో కారణాలతో పాటు భవిష్యత్తులో పరిశ్రమల నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.