Fri Feb 14 2025 00:56:36 GMT+0000 (Coordinated Universal Time)
డ్రోన్ పై డీజీపీ రెస్పాన్స్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై డ్రోన్ కెమెరా తిరగడంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. వరద ఉధృతిని తెలుసుకునేందుకే డ్రోన్ ను ఇరిగేషన్ శాఖ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై డ్రోన్ కెమెరా తిరగడంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. వరద ఉధృతిని తెలుసుకునేందుకే డ్రోన్ ను ఇరిగేషన్ శాఖ [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై డ్రోన్ కెమెరా తిరగడంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. వరద ఉధృతిని తెలుసుకునేందుకే డ్రోన్ ను ఇరిగేషన్ శాఖ ఉపయోగించిందని గౌతం సవాంగ్ చెప్పారు. లోకల్ పోలీసులకు, సెక్యూరిటీకి మధ్య కమ్యునికేషన్ గ్యాప్ అని చెప్పారు. ఇందులో ఎటువంటి కుట్ర లేదని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. దీనిని రాజకీయం చేయవద్దని సూచించారు. ఇకపై డ్రోన్ ను ఉపయోగించాలంటే లోకల్ పోలీసు అనుమతి తప్పనిసరి అని డీజీపీ తెలిపారు.
Next Story