Tue Apr 30 2024 11:16:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు
ఏపీ ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు జరపాలన్న పిటీషన్ విచారణ హైకోర్టు జరిపింది. కరోనా కారణంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని [more]
ఏపీ ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు జరపాలన్న పిటీషన్ విచారణ హైకోర్టు జరిపింది. కరోనా కారణంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని [more]
ఏపీ ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు జరపాలన్న పిటీషన్ విచారణ హైకోర్టు జరిపింది. కరోనా కారణంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ఈ మాటను ప్రభుత్వం కాదని ఏపీ ఎన్నికల కమిషన్ చెప్పాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీ ఎన్నికల సంఘం తరుపున ఎవరూ విచారణకు హాజరుకాకపోవడంతో ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను నవంబరు 2వ తేదీకి వాయిదా వేసింది.
Next Story