Sat Dec 06 2025 10:36:57 GMT+0000 (Coordinated Universal Time)
70వ రోజుకు చేరుకున్నా ఏంలాభం?
కనుచూపు మేరలో ఆశ కన్పించడం లేదు. అయినా తమ ఆందోళనలు మాత్రం వారు ఆపడం లేదు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 70వ రోజుకు [more]
కనుచూపు మేరలో ఆశ కన్పించడం లేదు. అయినా తమ ఆందోళనలు మాత్రం వారు ఆపడం లేదు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 70వ రోజుకు [more]

కనుచూపు మేరలో ఆశ కన్పించడం లేదు. అయినా తమ ఆందోళనలు మాత్రం వారు ఆపడం లేదు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 70వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం వీరి డిమాండ్లకు దిగిరావడం లేదు. అయినా ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. కృష్ణాయపాలెం, నేలపాడు, మందడం, పెనుమాక, ఎర్రబాలెం, తుళ్లూరు ప్రాంతాల్లో ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవుళ్లకు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.
Next Story

