Tue May 07 2024 19:14:20 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరి లాభం కోసం విశాఖ?
విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అమరావతి నుంచి పరిపాలనను తరలించడానికి తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. [more]
విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అమరావతి నుంచి పరిపాలనను తరలించడానికి తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. [more]
విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అమరావతి నుంచి పరిపాలనను తరలించడానికి తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. సభలో మూడు రాజధానుల బిల్లుపై ఆయన మాట్లాడుతూ ఎవరి లాభం కోసం రాజధానిని విశాఖకు తీసుకు వెళుతున్నారో తెలియడం లేదన్నారు. అహంకార పూరితమైన నిర్ణయాలను తీసుకుంటే భగవంతుడు క్షమించరన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను అన్యాయంగా అరెస్ట్ లు చేస్తున్నారన్నారు. రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనపడటం లేదన్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుని చరిత్ర హీనులు కావద్దని ఆయన కోరారు.
Next Story