Sat May 04 2024 03:42:06 GMT+0000 (Coordinated Universal Time)
మా గోడు పట్టించుకోరా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేస్తుందని వారు అన్నారు. అమరావతి [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేస్తుందని వారు అన్నారు. అమరావతి [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రులను మోసం చేస్తుందని వారు అన్నారు. అమరావతి ఉద్యమం నేటికి 513వరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇంటింటి అమరావతి కార్యక్రమాన్ని రైతులు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో పదివేల కోట్లు పనులు ఇక్కడ జరిగినా ఏమీ జరగలేనది చెబుతున్నారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ గోడును పట్టించుకోరా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
Next Story