Fri Dec 05 2025 22:15:46 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీకి డిమాండ్
అమరావతి రైతులతో చర్చలకు కమిటీని ఏర్పాటు చేయాలని మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఏడాదిపైగానే అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం [more]
అమరావతి రైతులతో చర్చలకు కమిటీని ఏర్పాటు చేయాలని మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఏడాదిపైగానే అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం [more]

అమరావతి రైతులతో చర్చలకు కమిటీని ఏర్పాటు చేయాలని మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఏడాదిపైగానే అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పద్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులు ఆందోళనలో భాగంగా కమిటీని నియమించినట్లే ఇక్కడ కూడా కమిటీని ఏర్పాటు చేయాలని పద్మశ్రీ కోరారు. రైతులతో చర్చలు జగన్ ప్రభుత్వం మొదలు పెట్టాలని ఆమె కోరారు. ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా అధికార పార్టీకి చెందిన ఒక్కరు కూడా పరామర్శించకపోవడం దారుణమన్నారు.
Next Story

