Wed Jan 28 2026 15:53:03 GMT+0000 (Coordinated Universal Time)
పదో తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం
పదో తరగతి పరీక్షలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం [more]
పదో తరగతి పరీక్షలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం [more]

పదో తరగతి పరీక్షలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. జూన్ 7వ తేదీ నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఏపీలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. పదోతరగతి పరీక్షలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. అయితే పదో తరగతి పరీక్షలను రద్దు కంటే వాయిదానే వేస్తేనే మంచిదని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.
Next Story

