Wed Jan 28 2026 20:46:33 GMT+0000 (Coordinated Universal Time)
కమీషన్ల కోసమే జగన్…?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఏపీలో ఏరులై పారుతోందన్నారు. మద్యపాన నిషేధం అమలు [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఏపీలో ఏరులై పారుతోందన్నారు. మద్యపాన నిషేధం అమలు [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఏపీలో ఏరులై పారుతోందన్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న జగన్ ఇచ్చిన హామీ ఏమైందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రతి బజారుకు ఒక మద్యం దుకాణం ఉందన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి జగన్ నాసిరకం బ్రాండ్ల మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధాన్ని విధిస్తానని జగన్ దుకాణాల సంఖ్య పెంచడంలో అర్థమేమిటని అచ్చెన్నాయుడు నిలదీశారు.
Next Story

