Fri Dec 05 2025 23:01:43 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వారికి దోచిపెట్టడానికే వచ్చినట్లుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమూల్ సంస్థకు జగన్ దోచి పెడుతున్నారన్నారు. ఏపీ డెయిరీకి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమూల్ సంస్థకు జగన్ దోచి పెడుతున్నారన్నారు. ఏపీ డెయిరీకి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అమూల్ సంస్థకు జగన్ దోచి పెడుతున్నారన్నారు. ఏపీ డెయిరీకి సంబంధించిన ఆస్తులను అమూల్ సంస్థకు లీజుకిచ్చే అధికారం జగన్ కు ఎవరిచ్చారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గుజరాత్ సంస్థ కోసం ఏపీ పాడి పరిశ్రమను జగన్ సర్వనాశనం చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. అమూల్ సంస్థకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు కోసమే డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story

