Thu Jan 29 2026 01:14:06 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ వన్నీ దొంగనాటకాలు
జగన్ పాత పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సున్నా వడ్డీ పథకం కూడా కొత్తది కాదన్నారు. అలాగే [more]
జగన్ పాత పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సున్నా వడ్డీ పథకం కూడా కొత్తది కాదన్నారు. అలాగే [more]

జగన్ పాత పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సున్నా వడ్డీ పథకం కూడా కొత్తది కాదన్నారు. అలాగే రివర్స్ టెండరింట్ లో 780 కోట్ల మిగిల్చామని చెప్పుకున్న జగన్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ఠు అంచనాలను ఎందుకు పెంచారో చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పట్టిసీమ దండగ అన్న జగన్ పోలవరం కుడికాల్వకు 912 కోట్లు ఎందుకు మంజూరు చేశారని అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రజలు ఇప్పటికైనా జగన్ పాలన గురించి ఆలోచించాలని, లేకుంటే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.
Next Story

