Mon Feb 02 2026 12:58:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎస్పైవై రెడ్డి ఫ్యాక్టరీ లో ప్రమాదం.. ఒకరి మృతి
నంద్యాల ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారందరినీ [more]
నంద్యాల ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారందరినీ [more]

నంద్యాల ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అమ్మోనియా గ్యాస్ లీకయిన కారణాలు తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో నంద్యాలలో ఎస్పైవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండ్రస్ట్రీస్ ఫ్యాక్టరీ ఉంది. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం సంభవించినప్పుడు ఫ్యాక్టరీలో 60 మంది వరకూ సిబ్బంది ఉన్నారు.
Next Story

