Fri Dec 05 2025 15:54:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గోదావరిలో పడవ ప్రమాదం.. గల్లంతయిన?
తూర్పు గోదావరి జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ఏరియా చింతూరు నుంచి వస్తుండగా శబరి నది వంతెనను ఢీకొని లాంచీ ముక్కలయిపోయింది. ఈ ప్రమాదంలో [more]
తూర్పు గోదావరి జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ఏరియా చింతూరు నుంచి వస్తుండగా శబరి నది వంతెనను ఢీకొని లాంచీ ముక్కలయిపోయింది. ఈ ప్రమాదంలో [more]

తూర్పు గోదావరి జిల్లాలో పడవ ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఏజెన్సీ ఏరియా చింతూరు నుంచి వస్తుండగా శబరి నది వంతెనను ఢీకొని లాంచీ ముక్కలయిపోయింది. ఈ ప్రమాదంలో ఎంత మంది గల్లంతయ్యారన్నది తెలియరాలేదు. లాంచీలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వరద బాధితులు కూడా కొందరు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు,రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలికిచేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
Next Story

