Tue Feb 03 2026 19:06:16 GMT+0000 (Coordinated Universal Time)
విపక్షాలకు లోకేష్ సవాల్ ఇదే

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దమ్ముంటే ఏపీకి ఐటీ కంపెనీలు తీసుకురావాలన్నారు. శాసనసభలో ఆయన ఈ సవాల్ విసిరారు. ఏపీకి ఇప్పటికే తాము చాలా ఐటీ కంపెనీలు తెచ్చామన్నారు. కంపెనీలు తెస్తే 21 రోజుల్లో భూములు ఇవ్వడానికి సిద్ధమని అసెంబ్లీలో చెప్పారు. ఐటీ కంపెనీలను విపక్షాలు తీసుకువస్తే తాను అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఊరికే ఆందోళనలు చేయడం సరికాదన్నారు. అయితే ఐటీ కంపెనీలను విపక్షాలు ఎలా తెస్తాయన్నది లోకేష్ కే తెలియాలి.
Next Story
