Wed Feb 04 2026 03:26:56 GMT+0000 (Coordinated Universal Time)
లాలూను వదల బొమ్మాళీ అంటున్న....

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరో సారి షాక్ తగిలింది. పశు దాణా కేసుకు సంబంధించి నాలుగో కేసులో కూడా లాలూ యాదవ్ ను రాంచీ సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. కొద్దిసేపటి క్రితం ఈ తీర్పు చెప్పింది. అయితే ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న జగన్నాధ్ మిశ్రాకు ఈ కేసులో ఊరట లభించింది. అయితే ప్రస్తుతం లాలూ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కోర్టుకు హాజరయ్యారు. శిక్షలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. లాలూ ఇదే కేసులో బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story
