Mon Apr 29 2024 05:40:29 GMT+0000 (Coordinated Universal Time)
మరో వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా
వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీంతో అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యే రోజాకు నోటీసులు జారీ చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే రోజా ఓటింగ్ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోనే మీడియాతో మాట్లాడారు. అయితే స్పీకర్ టీడీఎల్పీ ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్ లో పాల్గొనటమేమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా స్పీకర్ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారన్నారు. రోజా చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ సిబ్బంది స్పీకర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పీకర్ వెంటనే అసెంబ్లీ కార్యదర్శిని పిలిపించుకుని రోజాకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీనిపై రోజాను వివరణ కోరనున్నారు.
- Tags
- రోజా
Next Story