Wed Mar 25 2026 14:50:42 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజ్య సభలో సేమ్ సీన్

రాజ్యసభలో కూడా సేమ్ సీన్ కన్పించింది. సభ్యుల ఆందోళనలు విరమించాలని పదే పదే ఛైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కూడా అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. కావేరీ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేశారు. దీంతో సభను పదిహేను నిమిషాల పాటు వెంకయ్యనాయుడు వాయిదా వేశారు. అన్ని పార్టీల నేతలను తన ఛాంబర్ కు రావాల్సిందిగా వెంకయ్య ఆహ్వానించారు.
Next Story

