Fri Apr 10 2026 02:10:35 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణలో ఎస్టీలకు విద్యుత్తు బకాయీలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మొత్తం 70 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై భారం పడనుంది. ఎస్టీల విద్యుత్ బకాయీలన్నింటినీ రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఎస్టీ వ్యవసాయదారుడికీ విద్యుత్ కనెక్షన్ ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. 70 కోట్ల రూపాయల్లో ఇప్పటికే విద్యుత్ సంస్థలు 30 కోట్ల రూపాయలను రద్దు చేశాయి. మిగిలిన 40 కోట్ల రూపాయలను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది.
- Tags
- కేసీఆర్
Next Story

