Sat Mar 28 2026 06:35:05 GMT+0530 (India Standard Time)
కార్తీకి కష్టాలు

మాజీ కేంద్ర అర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను చెన్నై ఎయిర్ పోర్టు లో అదుపులోకి తీసుకున్నారు. కార్తీ చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియాకు సబంధించి విషయంలో విచారణ చేయనున్నారు. కార్తి చిదంబరం పది లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. ఈ మేరకు ఆయనను సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. చెన్నై నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి కార్తి చిదంబరాన్ని విచారించనున్నారు. అయితే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కార్తి చిదంబరాన్నిఅరెస్ట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
- Tags
- కార్తి చిదంబరం
Next Story

