Thu May 16 2024 22:10:09 GMT+0000 (Coordinated Universal Time)
బిడ్డల సాక్షి.. నాకు ఏ పార్టీతో దోస్తీ లేదు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ వద్ద ఆందోళనకు దిగారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లోటస్ పాండ్ వద్ద ఆందోళనకు దిగారు. అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేసినందుకు నిరసగా ఈ ఆందోళన చేపట్టారు. పోలీసులు అరెస్ట్ చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకు అనుమతివ్వరు?
బండి సంజయ్ పాదయాత్రకు అనుమతించిన పోలీసులు తన పాదయాత్రకు ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రల కారణంగానే పోలీసులు తన పాదయాత్రకు అనుమతివ్వడం లేదని, హైకోర్టు ఉత్తర్వులున్నా అడ్డంకులు కల్పిస్తున్నారని చెప్పారు. తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, తనకు ఏ పార్టీతో దోస్తీ లేదని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లు దోస్తీ కట్టాయని వైఎస్ షర్మిల ఆరోపించారు.
Next Story