Mon Dec 08 2025 15:37:31 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ పై మరోసారి షర్మిల ఫైర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా రైతుకు వ్యతిరేకమని ఆమె అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల నుంచి రైతులు అవస్థలు పడుతూనే ఉన్నారన్నారు. ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని షర్మిల తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు గాండ్ల శ్రీకాంత్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు.
శాపంగా మారింది.....
రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, హక్కుల కోసం పోరాడాలని వైఎస్ షర్మిల రైతాంగాన్ని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు ప్రభుత్వం ఎలాంటి ఆర్థికసాయం అందచేయకపోవడాన్ని కూడా షర్మిల తప్పు పట్టారు. ప్రతిసారీ కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వస్తున్నారని, రైతుల పాలిట కేసీఆర్ పాలన శాపంగా మారిందని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనంటూ షర్మిల మండిపడ్డారు.
- Tags
- ys sharmila
- kcr
Next Story

