Mon Dec 08 2025 15:35:49 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ సర్కార్ కు చావు డప్పు మోగించండి
తెలంగాణ రైతులు వరి వేయాల్సిందేనని, ప్రభుత్వం ఎందుకు కొనదో తేల్చుకుందామని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

తెలంగాణ రైతులు వరి వేయాల్సిందేనని, ప్రభుత్వం ఎందుకు కొనదో తేల్చుకుందామని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆమె రైతు ఆవేదన యాత్రను చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు యాదయ్య కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరి కారణనమి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
ఆత్మహత్యలు చేసుకుంటున్నా...
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అధికార పార్టీ ఆందోళనలు చేయడమేంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ రైతులు వరి వేయాల్సిందేనని, కేసీఆర్ సర్కార్ కు చావు డప్పు మోగించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. తాను వరి కొనుగోలుపై అవసరమైతే నిరాహారదీక్షకు దిగుతానని తెలిపారు. రైతుల కోసం తన ప్రాణాలనైనా అర్పిస్తానని షర్మిల భావోద్వేగంతో చెప్పారు.
- Tags
- ys sharmila
- kcr
Next Story

