Fri Dec 05 2025 22:44:39 GMT+0000 (Coordinated Universal Time)
పాదయాత్రకు స్వల్ప విరామం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పాదయాత్రకు విరామం ప్రకటించారు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. ఈ నెల 8వ తేదీన వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాలళులర్పించేందుకు పాదయాత్రకు విరామం ప్రకటించారు.
తిరిగి పదో తేదీ నుంచి..
వైఎస్సార్ ఘాట్ లో ఈ నెల 8వ తేదీన ప్రత్యేక ప్రార్థనలు జరిపిన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తిరిగి ఈ నెల 10వ తేదీ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల సూర్యాపేట జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
Next Story

