Thu Dec 18 2025 23:04:55 GMT+0000 (Coordinated Universal Time)
161రోజుకు షర్మిల పాదయాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుంది. ఆమె పాదయాత్ర నేడు 161వ రోజుకు చేరుకుంది. వికారాబాద్ నుంచి బయలుదేరిన వైఎస్ షర్మిల ఈరోజు వికారాబాద్ మండలం కొత్తగడి, నవాబ్పేట క్రాస్ రోడ్స్, మందాన్ పల్లి గేట్, వనంలప్లి, మొమిన్ పేట మండల పరిధిలో ఈ యాత్ర కొనసాగతుంది.
గ్రామస్థులతో ముచ్చట...
సాయంత్రం ఐదు గంటలకు వైఎస్ షర్మిల మోమిన్ పేట గ్రామ ప్రజలతో షర్మిల ముచ్చటించనున్నారు. షర్మిలను చూసేందుకు పాదయాత్ర జరుగుతున్న దారిలో వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. వైఎస్ షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
Next Story

