Tue May 14 2024 16:05:51 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో హిజ్రాను ప్రేమించి, పెళ్లాడిన యువకుడు !
భూపాలపల్లికి చెందిన రూపేశ్ కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం..
కొత్తగూడెం : హిజ్రాను ప్రేమించి, ఆమెతో సహజీవనం చేసి, పెద్దలను ఒప్పించి పెళ్లాడాడో యువకుడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగింది. భూపాలపల్లికి చెందిన రూపేశ్ కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
కొన్నాళ్లకు వారి స్నేహం ప్రేమగా మారింది. ఒకరికి వదిలి ఒకరు ఉండలేనంత గాఢ ప్రేమలో మునిగిపోయారు. ఇల్లెందులోని స్టేషన్ బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, మూడు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. ఎన్నాళ్లని ఇలా తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ఉండాలి ? అని భావించిన రూపేశ్ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. వారు కూడా అంగీకరించడంతో రూపేశ్-అఖిల ల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది.
Next Story