Fri Jan 30 2026 00:19:00 GMT+0000 (Coordinated Universal Time)
అలర్ట్ : ఈ రెండు రోజులు జాగ్రత్త
తెలుగు రాష్ట్రా రెండు రోజుల పాటు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈరోజు, రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వడగాలులు...
ఆంధ్రప్రదేశ్ లో ఎండ వేడిమితో పాటు వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అక్కడక్కడ ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది.
Next Story

