Tue Jan 20 2026 11:56:58 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రాజీనామాను ఆమోదించని గవర్నర్
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదించలేదు

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదించలేదు. ప్రభుత్వం మారడంతో ఆయన నిన్న రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు పంపారు. అయితే గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ జనార్థన్ రెడ్డి రాజీనామాను ఆమోదించలేదు.
ప్రశ్నాపత్రాల లీకేజీ...
ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో బాధ్యులు ఎవరో తెలియకుండా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకులకు బాధ్యులను చేస్తూ డీవోపీటీకి గవర్నర్ లేఖ రాయడంతో తమిళి సౌ సౌందర్ రాజన్ ప్రశ్నాపత్రం లీకేజీలో బాధ్యులెవరో తెలిసేంత వరకూ రాజీనామాను ఆమోదించకూడదని నిర్ణయించుకున్నారు.
Next Story

