Fri Dec 05 2025 13:47:17 GMT+0000 (Coordinated Universal Time)
గోడ కూలి ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ముగ్గురు కూలీలు మరణించారు

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోడ కూలి ముగ్గురు కూలీలు మరణించారు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించడంతో విషాదం అలుముకుంది. ఒక ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా కాంపౌండ్ వాల్ కూలడంతో అక్కడికక్కడే మరణించారు.
ముగ్గురూ ...
మృతులు ముగ్గురూ కొమరం భీం అసిఫాబాద్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు, పోలీసులు సహాయ కార్యక్రమాలను ప్రారంభించి వారిని రక్షించే ప్రయత్నం చేసిన అప్పటికే వారు మరణించారు. సరైన భద్రతపరమైన చర్యలు తీసుకోకుండా పునాదులు తవ్వుతున్నందునే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

