Mon Dec 15 2025 08:57:04 GMT+0000 (Coordinated Universal Time)
మాజీమంత్రి తలసాని ఇంట్లో విషాదం
బీఆర్ఎస్ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ ఇంట విషాదం నెలకొంది.

బీఆర్ఎస్ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ ఇంట విషాదం నెలకొంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్.. సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మఋతి చెందారు.
తెల్లవారు జామున...
ఈరోజు తెల్లవారుజామున తలసాని శంకర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు. తలసాని శంకర్ యాదవ్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. శ్రీనివాస యాదవ్ కు పలువురు నేతలు పరామర్శిస్తున్నారు.
Next Story

