Fri Mar 27 2026 08:21:26 GMT+0530 (India Standard Time)
నేడు బీజేపీ మౌన దీక్షలు
రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు చేపడుతుంది.

రాజ్యాంగాన్ని మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు చేపడుతుంది. మండల, జిల్లా పార్టీ కార్యాలయాల్లో నేతలు మౌన దీక్ష చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దీక్షలను చేపట్టనున్నారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు....
ఢిల్లీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. తొలుత ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం దీక్ష చేపడతారు. ఈ దీక్షలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాాబూరావుతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని బీజేపీ నేతలు ఈ దీక్షలు చేపడుతున్నారు.
Next Story

