Sat Jan 31 2026 00:12:30 GMT+0000 (Coordinated Universal Time)
రుద్రమదేవి దిగిన బావిని బతికించారు
రాణి రుద్రమదేవి స్నానం చేసిన కాకతీయుల కాలం నాటి మెట్లబావికి పూర్వ వైభవం వచ్చింది.

రాణి రుద్రమదేవి స్నానం చేసిన కాకతీయుల కాలం నాటి మెట్లబావికి పూర్వ వైభవం వచ్చింది. వరంగల్ ఫోర్టురోడ్డు శివనగర్లో నలువైపులా 14 మీటర్ల వెడల్పుతో చతురస్రాకారంలో ఉంటుంది ఈ బావి. కాకతీయుల కాలం నాటి శిల్పసంపదకు సాక్ష్యం. సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరిన బావి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అవి పూర్తవడంతో ఆ బావిని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. కాకతీయ కోట నుంచి ఈ బావికి రుద్రమ దేవి సొరంగ మార్గాన వచ్చేవారని, ప్రస్తుతం ఆ మార్గం పూడుకుపోయిందని స్థానికులు చెబుతారు. ఈ బావి ఇక టూరిస్ట్ స్పాట్ గా మారిపోనుందని స్థానికులు చెబుతున్నారు.
Next Story

