Fri Dec 05 2025 22:08:41 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి
ఇదే సమయంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలు..

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గతవారం 20, 20 లోపు కేసులు నమోదవ్వగా.. ఈ వారం రోజువారీ కేసులు 30కి చేరాయి. గతరాత్రి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 15,633 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 30 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వాటిలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 17 కొత్తకేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 7,91,857 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7,87,508 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 238 కేసులు యాక్టివ్ గా ఉండగా వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 4,111 మంది కరోనాతో మరణించారు.
Next Story

