Fri Dec 05 2025 17:59:01 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్ పాకాలపై నమోదయిన ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?
బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు

బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. జనవాడలోని ఆయన ఫామ్హౌస్పై దాడి చేసిన తర్వాత డ్రగ్స్కు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. మొదట్లో ఎక్సైజ్ ఉల్లంఘనల కింద మాత్రమే కేసు నమోదు చేశారు. . మోకిలా పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం....
సంయుక్తంగా జరిపిన దాడిలో...
అక్టోబర్ 26వ తేదీన రాజ్ పాకాల ఫామ్హౌస్లో అనధికార విదేశీ మద్యం మరియు డ్రగ్స్తో కూడిన పార్టీ గురించి మోకిలా పోలీసులకు సమాచారం అందిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దీంతో నార్సింగి పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్, ఎక్సైజ్ అధికారులు దాడులు సంయుక్తంగా నిర్వహించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు 22 మంది పురుషులు, పదహారు మంది స్త్రీలు ఉన్నారని ఎఫ్ఐఆర్ లో తెలిపారు. వారిలో కొందరు పారిపోవడానికి ప్రయత్నించారని, కానీ అధికారులు వారిని పట్టుకున్నారని తెలిపారు.
విదేశీ బాటిల్స్ తో పాటు...
ఫామ్హౌస్లో మధ్యవర్తుల సమక్షంలో జరిపిన విచారణలో పేకాట నాణేలు మరియు ప్లే కార్డ్ల సెట్లతో సహా అనేక వస్తువులు లభించాయని తెలిపారు. పేకాట సామాగ్రితో కూడిన మూడు అల్యూమినియం బ్రీఫ్కేస్లు, 17 అనధికార మద్యం బాటిళ్లను కూడా ఎక్సైజ్ శాఖ స్వాధీనం చేసుకుందని ఎఫ్ఐఆర్ లో మోకిలా పోలీసులు పేర్కొన్నారు. మద్యం ఉల్లంఘనలకు సంబంధించిన అదనపు కేసు కూడా నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Next Story

