Fri Dec 05 2025 11:28:07 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం..39 మంది సస్పెన్షన్
తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 39మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 39మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం కలకలం రేపుతోంది. ఇంత పెద్ద స్థాయిలో పోలీసు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవడం ఇదే తొలిసారి అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నాళ్లుగా పోలీస్ బెటాలియన్ సిబ్బంది భార్యలు ఆందోళనలు చేస్తున్నారు.
ఆ:దోళనలు చేస్తున్న...
తమ డిమాండ్లను పరిష్కరించాలని రాస్తారోకో చేశారు. సచివాలయాన్ని ముట్టడించారు. తాజాగా కొందరు పోలీసులు కూడా ఆందోళను చేయడంతోప్రభుత్వం వెంటనే చర్యలు తీసకుంది. ఆందోళనలు ప్రేరేపిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంది. ఆర్టికల్ 311ను ప్రయోగించి 39 పై సస్పెండ్ ఉత్తర్వులను పోలీస్ శాఖ జారీ చేసింి. 3,4,5,6,12,13,17వ బెటాలియన్ లలో ని 39మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేసింది.
Next Story

