Wed Jan 21 2026 15:29:39 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు పీసీసీ చీఫ్ కీలక సమావేశం
తెలంగాణ పీసీీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ల ఛైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేశారు.

తెలంగాణ పీసీీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ల ఛైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు ప్రభుత్వ పథకాలను మరింతగా తీసుకు వెళ్లేలా కృషి చేయాలని తెలపనున్నారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. దీంతో పాటు కార్పొరేషన్ల పనితీరును కూడా ఆయన అడిగి తెలుసుకోనున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను...
నిధుల సమస్యలతో పాటు ఇంకేవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని మహేశ్ కుమార్ గౌడ్ కార్పొరేషన్ల ఛైర్మన్లకు తెలపనున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రయత్నించాలని మహేశ్ కుమార్ గౌడ్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

