Fri Dec 05 2025 12:47:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : బనకచర్లపై నేడు తెలంగాణలో అఖిలపక్ష సమావేశం
ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై నేడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు

ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై నేడు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తమ్ ఈ అఖిలపార్టీ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే తెలంగాణకు జరిగే నష్టాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించనున్నారు.
అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను...
ఈ సమావేశానికి తెలంగాణలోని అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో పాటు ముఖ్య నేతలను ఆహ్వానించారు. బనకచర్ల వల్ల కలిగే నష్టం తెలంగాణకు ఉండటంతో కేంద్రంలో దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించాలని కోరనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కూడా ఈ సమావేశఆనికి రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.
Next Story

