Fri Dec 05 2025 23:13:05 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని లేఖలో కోరారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి సాధించేందుకు మరిన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని కేటీఆర్ రాసిన లేఖలో కోరారు.
అవసరమైన నిధులను....
తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు. ఈ విషయంపై గతంలో అనేక సార్లు నిర్మలా సీతారామన్ ను కోరామని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ లో నేషనల్ డిజైన్ సెంటర్ కార్యకలాపాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని కేటీఆర్ తన లేఖలో కోరారు.
Next Story

