Fri Dec 05 2025 23:11:48 GMT+0000 (Coordinated Universal Time)
ఓబులాపురం మైనింగ్ కేసులో
ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పనుంది.

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు ప్రకటించడంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.
డిశ్చార్జ్ పిటీషన్ పై...
నేడు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు నిస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. మంత్రి వర్గ నిర్ణయాలను మాత్రమే తాను అమలు చేశానని, ఈ కేసులో జరిగిన అవినీతికి తనకు ఎటువంటి సంబంధం లేదని శ్రీలక్ష్మి తరుపున న్యాయవాదులు వాదించారు. మరి నేడు శ్రీలక్ష్మి కేసులో తీర్పు ఎలా రానుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story

