Sat May 18 2024 14:40:49 GMT+0000 (Coordinated Universal Time)
ప్రజలకు షాక్.. ఛార్జీలను పెంచనున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చే దిశగా నిర్ణయాలను తీసుకోనుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు కసరత్తులు చేస్తుంది
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చే దిశగా నిర్ణయాలను తీసుకోనుంద.ి రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు కసరత్తులు చేస్తుంది. అదనంగా 4,500 కోట్ల రూపాయల రాబడిని సంపాదించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్తులు, భూముల విలువపై రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. దాదాపు యాభై శాతం పెంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఆస్తుల విలువలో...
ఇంటి స్థలాల విలువను 35 శాతం, అపార్ట్ మెంట్ల విలువను 25 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశాలున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెరిగిన ఛార్జీలు అమలులోకి వచ్చే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేస్ుతుంది. ఇక భూముల విలువను అరవై నుంచి 150 శాతం పెంచుతారన్న అంచనాలు విన్పిస్తున్నాయి.
Next Story