Thu Mar 26 2026 20:46:25 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో భూముల ధరల పెంపు?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. భూముల ధరలను సవరించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నిర్ణయించింది. దీనిపై త్వరలో రాష్ట్రంలో భూముల విలువ పెంచే అవకాశం ఉంది. గత ఏడాది హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు లోపల భూముల విలువ సవరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినా, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టింది.
త్వరలోనే నిర్ణయం...
హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువ సవరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు పెరిగి రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి.
Next Story

