Thu Jan 29 2026 06:08:45 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : సీబీఐకి అనుమతి.. హోంశాఖకు లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. రెండు రోజుల క్రితంకాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై విచారించిన శాసనసభ ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.
సీబీఐని అనుమతిస్తూ...
అయితే రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి లేకుండా గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోకి సీబీఐ విచారణను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల కూడా జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నిజాలను నిగ్గుతేల్చాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది.
Next Story

